తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాన్ని అందించిన నిధి అగర్వాల్.. ఎంతంటే.. ?

తమిళనాడు ప్రభుత్వానికి కరోనా కష్టకాలంలో పలువురు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్న విషయం విదితమే.ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మాత్రం ఈ రాష్ట్రంలో ఒకరేంజ్‌లో రెచ్చిపోతుంది.

 Tamil Nadu, Cm Relief Fund, Nidhi Agarwal, Donates-TeluguStop.com

దీని ఫలితంగా ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.అదీగాక ఎన్నో మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

అయితే ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం పై పూర్తి భారం వేయకుండా ఈ రాష్ట్రానికి చెందిన చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఒక్కొక్కరుగా తమ వంతు సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నారు.

కాగా ఇప్పటికే నటులు కార్తీ, సూర్య, రజనీకాంత్ కూతురు సౌందర్య, రజనీకాంత్, చియాన్ విక్రమ్ విరాళాలు అందించారు.

ఇక తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసింది.ఇదే కాకుండా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న బెడ్ల సమాచారాన్ని తెలియచేసే ‘ఫైండ్ ఏ బెడ్’ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube