తమిళనాడు ప్రభుత్వానికి కరోనా కష్టకాలంలో పలువురు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్న విషయం విదితమే.ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మాత్రం ఈ రాష్ట్రంలో ఒకరేంజ్లో రెచ్చిపోతుంది.
దీని ఫలితంగా ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.అదీగాక ఎన్నో మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
అయితే ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం పై పూర్తి భారం వేయకుండా ఈ రాష్ట్రానికి చెందిన చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఒక్కొక్కరుగా తమ వంతు సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నారు.
కాగా ఇప్పటికే నటులు కార్తీ, సూర్య, రజనీకాంత్ కూతురు సౌందర్య, రజనీకాంత్, చియాన్ విక్రమ్ విరాళాలు అందించారు.
ఇక తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసింది.ఇదే కాకుండా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న బెడ్ల సమాచారాన్ని తెలియచేసే ‘ఫైండ్ ఏ బెడ్’ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.