టాలీవుడ్ లో సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు భామ నిధి అగర్వాల్.తెలుగులో కంటే ఈ అమ్మడు ముందుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.
అక్కడ అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇక టాలీవుడ్ బాట పట్టింది.తెలుగులో ఈ అమ్మడుకి భాగానే అవకాశాలు వచ్చాయి.
మొదటి సినిమా డిజాస్టర్ అయ్యింది.తరువాత పూరీ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఛాన్స్ దక్కించుకుంది.
ఇక ఆ సినిమాలో నిధి అందాల గని అనిపించుకుంది.ఈ అమ్మడుని ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో ఆ స్థాయిలో పూరీ వాడేసుకున్నాడు.
ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇస్మార్ట్ గర్ల్ గా పేరు పడిపోయింది.ఇక తరువాత అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసిన అది అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మహేష్ బాబు మేనల్లుడు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఒకటి ఉంది.దీంతో పాటు మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఫైనల్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి సినిమాలలో వచ్చిన క్రేజ్ కంటే సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ ఎక్కువ అని చెప్పాలి.ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తూ ఉంటుంది.
అలాగే లైవ్ లోకి వస్తూ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది.ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో అమ్మడుని మంచి ఫాలోయింగ్ ఉంది.తాజాగా పేస్ బుక్ లో ఆమె తన ఫాలోవర్స్ ని 8.5 మిలియన్స్ కి పెంచుకుంది.మొత్తం సోషల్ మీడియాలో 14.5 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది.ఈ సందర్భంగా తనని ఇంతగా అభిమానిస్తూ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న అభిమానులకి నిధి అగర్వాల్ థాంక్స్ చెప్పింది.