టాలీవుడ్ లో ఈ మధ్యకాలం లో క్రేజీ హీరోయిన్ గా దూసుకొస్తున్న అందాల భామ నిధి అగర్వాల్.తన పరువందాలాతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ చిన్న సినిమాల ద్వారా కంటే తన ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
తెలుగులో ఈ అమ్మడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు తమిళంలో కూడా తెరంగేట్రం చేసింది.శింబు హీరోగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వరన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాలో కూడా అమ్మడు అందాల విందు చేసింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడుకి ఈశ్వరన్ ఆడియో వేడుకలో చేదు అనుభవం ఎదురైంది.
ఈ ఆడియో వేడుక సందర్భంగా అతిథులు అందరూ స్టేజ్ పైన మాట్లాడుతూ ఉన్నారు.
ఇక వరుస పెట్టి అందరూ కూడా ఈశ్వరన్ సినిమాలో శింబు చేసిన పెర్ఫార్మెన్స్ ని, అతని డెడికేషన్ ని పొగడటమే పనిగా పెట్టుకున్నారు.ఇక నిధి అగర్వాల్ కూడా స్టేజ్ మీద సినిమా గురించి చెప్పే ప్రయత్నం చేసింది.అయితే పక్కనే ఉన్న దర్శకుడు శింబు గురించి మాట్లాడాలని ఆమెకి పదేపదే సూచనలు చేస్తూ ఉండటంతో ఆమె కొద్దిగా గందరగోళానికి గురైంది.
అదే సమయంలో శింబుకి ఐ లవ్ యూ అని చెప్పు అంటూ నిధిని సుశీంద్రన్ ఫోర్స్ చేసే ప్రయత్నం చేశాడు.అలాగే తమిళంలోనే మాట్లాడాలని పదే పదే పట్టుబట్టడంతో ఆమె మాట్లాడలేక కొంత ఇబ్బందికి గురైంది.
దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
.