ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ లాక్డౌన్ కారణంగా దేశప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎలాంటి ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో వలస కార్మికులు కాలినడకన తమ సొంతూళ్లకు పయనం అయ్యారు.ఈ క్రమంలో వారి కష్టాలను చూసి పలువురు చలించిపోయారు.
కాగా పలువురు సెలబ్రిటీలు వలస కార్మికులను తమ సొంతూళ్లు చేరేవరకు వారికి ఎలాంటి కష్టం ఎదురవ్వకుండా తమవంతు సాయం చేశారు.
కాగా తాజాగా వలస కార్మికుల కష్టాలను చూసి చలించిపోయిన అందాల భామ నిధి అగర్వాల్ తనలోని మానవత్వాన్ని చాటుకుంది.
వలస కార్మికుల ఆకలి కేకలు తన మనసును కలిచివేశాయని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ, వారి ఆకలిని తీర్చే ప్రయత్నం చేసింది.ఈ క్రమంలోనే తనకు తోచిన సహాయంగా బ్రెడ్ ప్యాకెట్లు సాయం చేసేందుకు రెడీ అయ్యింది.
వలస కార్మికులు ఆకలి బాధలు పడకుండా ఉండేందుకే ఇలా ఆహారం పంపిణీ చేస్తున్నట్లు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
గతేడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది.
అయితే సినిమా షూటింగ్ల కంటే ఎక్కువ హాట్ ఫోటోషూట్లతో అదిరిపోయే క్రేజ్ను దక్కించుకుంటోంది ఈ బ్యూటీ.ఏదేమైనా అందంతో పాటు ఆదుకోవాలనే మనస్తత్వం ఉన్న నిధి అగర్వాల్ నిజంగా గ్రేట్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.