టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుని అదే జోష్ లో ఈ సినిమా మొదలు పెట్టాడు.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తునట్టు ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయితే ఈ రెండు సినిమాలు మహేష్ బాబు లోని మరొక కోణాన్ని బయటకు తీసుకొచ్చాడు త్రివిక్రమ్.
ఈ సినిమాను త్రివిక్రమ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.
ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ అమ్మడికి ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ వచ్చింది.
తాజాగా మహేష్ సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉంది.ఒక హీరోయిన్ గా పూజ పేరు వినిపిస్తుంటే మరొక హీరోయిన్ గా నిధి పేరు వినిపిస్తుంది.ముందుగా జాన్వీ కపూర్ ను సంప్రదించాలని అనుకుంటున్నారు.
ఒకవేళ జాన్వీ నో చెబితే ఆ ఛాన్స్ నిధికి వస్తుందని టాక్.