ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి మనందరికీ తెలిసిందే.మొదట హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత హీరో అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను లో హీరోయిన్ గా నటించింది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అందం, అద్భుతం ఉన్నప్పటికీ ఆమెకు అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.ఆ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెకు ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపంలో భారీ హిట్ ను అందించాడు.
నిధి అగర్వాల్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.
ఇక ఈమె తనకున్న క్రేజ్ తో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఇండస్ట్రీలో సినిమాలకు సైన్ చేసింది.
ప్రస్తుతం కోలీవుడ్ లో జయం రవి, శింబు లాంటి స్టార్స్ తో జతకట్టింది.అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం హీరో.
ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తోంది.
అయితే కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది అనుకుంటున్న క్రమంలోనే తాజాగా నిధి అగర్వాల్ కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.త్వరలోనే నిధి అగర్వాల్ పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోతో నిధి అగర్వాల్ ప్రేమ లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.హీరో ఎవరో కాదు శిలంబరసన్.ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో ఉందని, అంతేకాకుండా వారిద్దరు సహజీవనం చేస్తున్నారు అంటూ కోలీవుడ్ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఆ జంట మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆ జంట నిజంగానే ఒకటవుతారా? లేదా? అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.మరి ఈ విషయం పై నిధి అగర్వాల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.