సాంధ్యశ్రీ.ఈయన ఒక కవి మరియు విమర్శకుడు.
అయన ఒక విషయం పై మాట్లాడుతూ భానుప్రియ గురించి గుర్తు చేసుకున్నారు.ఆమె వొంటి నుంచి ఒక అద్భుతమైన, గాఢమైన పరిమళం ఒకటి వస్తు ఉంటుందట.
ఈ విషయం అయన మాత్రమే కాదు అంతకు ముందు ఒక దర్శక దిగ్గజం కూడా చెప్పినట్టు గుర్తు.ఒకసారి రామానాయుడు స్టూడియో(Ramanaidu Studio)లో కె విశ్వనాథ్(K Vishwanath) గారితో మాట మంతి జరుపుతున్నారు నిర్మాత రామానాయుడు.
ఆ సమయం లో కార్ లో నుంచి భానుప్రియ (bhanu priya)దిగి డైరెక్టర్ మరియు నిర్మాత దగ్గరికి వెళ్తుందట.ఆమె వస్తుంటే ఒక పరిమళం ఆమె కన్నా ఒక అడుగు ముందే అందరి ముక్కును తాకింది.
అయితే ఆమె సెంటు, పెర్ఫ్యూమ్(Perfume) కానీ కొట్టుకోలేదు.మరి ఆ వాసనా ఎలా వచ్చింది అనేది ఒక అద్భుతం.అది సువాసన వెదజల్లుతున్న సహజ వాసన అని చెప్పఁడానికి పెద్ద టైం పట్టలేదు.పైగా ఆమె ఒంటికి సబ్బు కూడా పెట్టుకోకుండా కేవలం సున్ని పిండి తోనే స్నానం చేస్తుందట.
సౌందర్య సాధనాలు ఆమెకు ఎలర్జీ అని అందుకే తలస్నానం చేసిన షాంపూ లాంటివి వాడకుండా కుంకుడు కాయ తోనే చేస్తుందట.సౌందర్య ఉత్పత్తులకు ఆమె చాల దూరం.
భాను ప్రియా స్నేహితులు, దగ్గరగా ఉండేవాళ్ళు కూడా ఇదే చెప్తారు.ఆమె పక్కన కూర్చుంటే ఎంతో మంచి సువాసన వస్తు ఉంటుందట.
ఆ రహస్యం ఏంటి అని భాను ప్రియా ను చాలామంది అడిగిన కూడా ఆమెకు కూడా ఆ విషయం తెలియదు అని చెప్పేది.అయితే అసలు విషయం ఏమిటి అంటే ఇలా శరీరం నుంచి పరిమళ సుగంధం లాగ సువాసన వస్తుంటే వారిని పద్మగంది అంటే అంటారట.పద్మం వంటి సువాసన గంధం విరజిమ్ముతూ ఉంటారట ఈ జాతి స్రీలు.సాదరంగా దేవతలకు, అప్సరసలు మాత్రమే ఇలాంటి సువాసన కలిగి ఉంటారట.కానీ ఒక సినీ నటి గురించి ఇలా చాల మంది కథలు కథలుగా చెప్పుకోవడం అంటే నిజముగా పెద్ద విషయమే.ఇక ప్రస్తుతం భానుప్రియ మెమొరీ లాస్ తో బాధపడుతూ సినిమా రంగానికి కూడా దూరంగా ఉన్నారు.