హనీట్రాఫ్ గూఢచర్యం కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు.వస్త్ర వ్యాపారిలో ముసుగులో భారత నౌకాదళ రహస్య సమాచారాలను పాకిస్థాన్ గూఢచారులకు చేరవేస్తుండేవాడు.
నౌకదళ రహస్య సమాచారాలు లీకవుతున్నాయని కేంద్రానికి వెల్లడించండంతో ఈ పనిని కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది.దీంతో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు హనీట్రాఫ్ గూఢచర్యం కేసులో నిందితుడిని పట్టుకున్నారు.
ప్రత్యేక విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ నిందితుడు ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు.గుజరాత్ కు చెందిన ఇమ్రాన్ గిటేలి ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ లో భాగంగా నౌకాదళ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచారులకు పంపించేవాడు.
రహస్యాలు చేరవేస్తున్న నౌకాదళ అధికారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తుండేవాడు.దీనిపై విచారణ జరిపిన ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక టీంగా ఏర్పడి గుజరాత్ లోని గోద్రా పంచమహల్ గ్రామంలో సోమవారం ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు.
ఇమ్రాన్ కు పాక్ గూఢచారులతో, ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయి.గుజరాత్ లో వస్త్ర వ్యాపారి ముసుగులో కొనసాగుతూ పాకిస్థాన్ గూఢచారులకు సమాచారాన్ని చేరవేసేవాడని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.
ఇమ్రాన్ ఇంటిపై, వస్త్ర వ్యాపారంపై దాడులు నిర్వహించగా పలు పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్కులు, రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఇమ్రాన్ గిటేలి ఐపీసీ సెక్షన్ 120బీ, 121ఏ, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ సెక్షన్ 3, సంఘ వ్యతిరేక చర్యల నిరోధక చట్టం సెక్షన్ 17, 18ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు.
ఇతనితో పాటు నౌకాదళానికి చెందిన 14 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.