దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.మెజార్టీ ప్రజలు ఈ ఎన్ కౌంటర్ ను సమర్థిస్తుండగా, కొద్ది మంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఏది ఏమైనా ‘దిశ’కు సరైన న్యాయం లభించిందని దేశవ్యాప్తంగా ఆనందం వెల్లువిరుస్తోంది.ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై జాతీయ మానవహక్కులు సంఘం (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది.
దీనిపై మీడియాలో వచ్చిన కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది.అంతేకాదు ఈ ఎన్కౌంటర్పై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది.
దిశ నిందితుల ఎన్కౌంటర్ను క్షుణ్ణంగా పరిశీలించడానికి తెలంగాణకు నిజనిర్ధారణ కమిటీని పంపాలని ఇన్వెష్టిగేషన్ డీజీ కి ఆదేశాలు జారీ చేసింది.నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండగా ఎన్కౌంటర్ కావడంపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.