సూర్య హీరోగా రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎన్జీకే’ చిత్రం తమిళంలో ఆకట్టుకున్నా తెలుగులో మాత్రం మెప్పించడంలో విఫలం అయ్యింది.తెలుగులో ఈ చిత్రం మొదటి రోజే ఫ్లాప్ టాక్ను దక్కించుకుంది.
తమిళంలో మాత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ను దక్కించుకోవడంతో పాటు లాంగ్ రన్లో కూడా కుమ్మేస్తోంది.తమిళం మరియు తెలుగులో వేరు వేరు ఫలితాలు వచ్చిన నేపథ్యంలో సినీ విశ్లేషకులు ఎందుకు ఈ ఫలితం అనే విషయాన్ని అంచనా వేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవి ఓవర్ యాక్షన్ నచ్చలేదని అంటున్నారు.ఇక సాయి పల్లవి వల్ల తెలుగులో ‘ఎన్జీకే’ చిత్రం ఫలితం తారుమారు అయ్యిందని అంటున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ఉంది.రకుల్ ప్రీత్ సింగ్ మరియు సాయి పల్లవిల మద్య ఉండే సీన్స్ వల్ల సినిమా ఫ్లాప్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది.
తమిళ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న విధంగా ఆ సీన్స్ను తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేక పోయారు.
సూర్య భార్యగా సాయి పల్లవి లేకుండా ఉంటే లేదంటే రకుల్ ప్రీత్ సింగ్ పాత్రలో పురుషుడు ఉండి ఉంటే సినిమా తెలుగులో ఆకట్టుకునేదేమో అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.మొత్తానికి ‘ఎన్జీకే’తో తెలుగు మరియు తమిళంలో మరో విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్న సాయి పల్లవికి ఒక కంట పన్నీరు, ఒక కంట కన్నీరు అన్నట్లుగా పరిస్థితి ఉంది.సాయి పల్లవి తెలుగులో ఈ చిత్రంతో ఆకట్టుకోలేక పోయినా కూడా ఈమెకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.