సీఎం జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని నెక్స్ట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ సమీర్ శర్మ.సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 Ap Next Chief Secretary Dr Sameer Sharma Met Cm Jagan, Cm Ys Jagan, Ap Next Chie-TeluguStop.com

ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ కాలం ఈ నెలాఖరున అనగా సెప్టెంబర్ 30వ తారీఖున ముగియనుంది.ఆయన స్థానంలో చీఫ్ సెక్రటరీగా డాక్టర్ సమీర్ శర్మని ఏపీ ప్రభుత్వం నియమించడం జరిగింది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక అదే రీతిలో రిసోర్స్ మొబైల్ లొకేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా సమీర్ శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ క్రమంలో అక్టోబర్ మొదటి తారీకు నుండి సమీర్ శర్మ.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇటువంటి తరుణంలో సీఎం జగన్ తో ముందుగానే భేటీ అయి మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.

ఈ సందర్బంగా సీఎం జగన్ కి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.ఆదిత్యనాథ్ దాస్ ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని ఉండేవారు.

ఆ తర్వాత ఆదిత్యనాథ్ దాస్… తర్వాత ఇప్పుడు సమీర్ శర్మ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి బాధ్యతలు చేపట్టనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube