పెళ్ళి చేసుకుని నెలరోజులు కూడా గడవక ముందే నవదంపతులు ఉండవల్లి గుహల కొండపైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు.వీరిది ప్రేమ వివాహం.
ఈ ఘటనలో భర్త మరణించాడు.భార్య చావుబతుకులతో పోరాడుతుంది.ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ జవహర్ నగర్ కు చెందిన ఫర్జానా, ప్రకాశం జిల్లా హనుమంతులపాడు మండలం చిన్న ముప్పాళ్లపాడు గ్రామానికి చెందిన పృథ్వీ అనే యువకుడు మంగళవారం రోజు ఉండవల్లి గుహల కొండపైకి వెళ్లారు.
అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు ఈ విషయాన్నీ తల్లి దండ్రులకు చెప్పారు.
కొండపైకి వెళ్లిన జంట చాలా సమయమైనా కిందకు రాకపోవడంతో స్థానికులు కొండపైకి వెళ్లి చూడగా ఇద్దరూ నురగలు కక్కుతూ పది ఉన్నారు.
వెంటనే స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు.అప్పటికే పృథ్వీ చనిపోయాడు.
ఫర్జానా అపస్మారక స్థితిలో ఉండడంతో స్థానికులు కొండపై నుండి మోసుకొచ్చి అంబులెన్సు లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడకు చేరుకొని మృతుడి జేబులో ఫోన్ నెంబర్, ఆధార్, ఓటర్ ఐడి కార్డులను గుర్తించి అతని తండ్రికి సమాచారం అందించారు.కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.పృథ్వీ హైదరాబాద్ లో పండ్ల వ్యాపారం చేసేవాడు.
అక్కడే ఫర్జానాను ప్రేమించి జనవరిలో పెళ్ళి కూడా చేసుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు.
ఫర్జానా తల్లిదండ్రులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు.
మంగళవారం రోజు పృథ్వీ తన తండ్రికి ఫోన్ చేసి నేను ప్రేమించి పెళ్లిచేసుకున్నానని.మేమిద్దరం ఇంటికి వస్తున్నామని చెప్పాడు.
పృథ్వీ తండ్రి ఆమెను తీసుకొస్తే పరువుపోతుందని కొడుకుకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.అయితే ఇది జరిగిన రెండు గంటలకే పోలీసుల నుండి తన కొడుకు చనిపోయాడని ఫోన్ వచ్చిందని కన్నీరు మున్నీరయ్యాడు.