ఎంతో సంతోషంగా తమ దాంపత్య జీవితం గడపాలని ఎన్నోకలలు, ఆశలతో శోభనం గదిలో అడుగు పెట్టిన భార్యకు తన భర్త చేసిన పనికి తీవ్రంగా నిరాశ చెందింది.అంతేకాక శోభనం రోజున తనను తన భర్త సరిగా సంతృప్తి పరచలేదంటూ ఏకంగా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నవతరం ఇల్లాలు.
వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ కు చెందిన ముర్షీదాబాద్ ప్రాంతంలోని ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో గత వారం వివాహం అయ్యింది.అయితే వివాహం అయిన మరుసటి రోజు ఆ యువతి ఎన్నో కోరికలతో పాల గ్లాసు తీసుకుని శోభనం గదిలోకి అడుగు పెట్టింది.
అయితే ఆమె భర్త మాత్రం ఆమె తెచ్చిన పాలు తాగి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.దీంతో ఆమె తీవ్ర నిరాశకి గురైన ఆమె నిద్రపోయిన అతడిని లేపి మరీ తన కోరిక తీర్చాలంటూ అడిగింది.
దీంతో అతడు నీ పైన నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవని ఖరాఖండిగా చెప్పేసాడు.దీంతో ఆమె ఒక్కసారిగా ఖంగు తింది.
అయితే మరి ఇష్టంలేని పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ అంటూ పలుమార్లు తన భర్త అని ప్రశ్నించగా మౌనంగా సమాధానమిచ్చాడు.దీంతో ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పగా వారు వరుడి తల్లిదండ్రులను ఈ విషయంపై నిలదీశారు.దీంతో అతడి తల్లిదండ్రులు తన కొడుకు తప్పేమీ లేదని కోడలు కావాలనే ఇలాంటి రచ్చ చేస్తుందని వివరించారు.ఇక చేసేదేమి లేక ఆ ఇల్లాలు ఈ విషయంపై పోలీసులు సంప్రదించింది.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.