ఆ మధ్య ఒక కంపెనీ సీఈవో అయిన తండ్రి పసిబిడ్డకు పాలు పట్టించిన ఘటన సోషల్ మీడియా లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మరో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
అయితే ఈ సారి ఏ కంపెనీ సీఈవో కాదు, ఏకంగా పార్లమెంట్ స్పీకర్ ఇలా పసిబిడ్డకు సీసా పాలు పడుతూ వైరల్ అయ్యారు.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా.
ఇక్కడ కాదు లేండి,న్యూజిలాండ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.పార్లమెంట్ స్పీకర్ ట్రెవర్ మల్లార్డ్ ఒక ఎంపీ పసిబిడ్డను దగ్గరకు తీసుకొని,పాలు పట్టించి,ఆడించిన ఘటన అందర్నీ ఆశ్చర్యపరచింది.
అసలు విషయం ఏమిటంటే ఆదేశ ఎంపీ తమాతి కొఫీ ఈ మధ్యే పండింటి పసికందును ప్రసవించింది.వెటర్నటీ లీవు కాస్తా ముగియడం, పార్లమెంట్లో ముఖ్యమైన డిబేట్ పాల్గొనాల్సి వచ్చింది.తల్లి డిబేట్తో బిజీగా ఉండటంతో స్పీకర్ ట్రేవర్ ఆ పాపను ఆడించమే కాదు పాలు కూడా పట్టారు.మామూలుగా అయితే స్పీకర్ కుర్చీలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూర్చుంటారు.
కానీ, తనతోపాటు ఇవాళ ఓ వీఐపీ కొలువుదీరిందంటూ ఆయన ట్వీట్ చేసారు.