తాజాగా జరిగిన పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్న న్యూజిలాండ్ స్టార్ బౌలర్ రిచర్డ్ సన్ తాజాగా జరిగిన మ్యాచ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అనుభవించిన క్షణాలను తెలియజేశాడు.ఇందులో భాగంగా తనకు మొదట కాస్త భయం వేసిందని.
తాను మరి ఇంత ధర ఐపీఎల్ లో పలకడం అంచనాలను మించి ఉందని దాంతో అదే స్థాయిలో పంజాబ్ కింగ్స్ జట్టుకు సేవలు అందిస్తామని తెలిపారు.
ఇకపోతే వేలం జరుగుతున్న సమయంలో తాను నిజానికి న్యూజిలాండ్ లో ఉన్నానని అప్పటికే తన దేశంలో రాత్రి అయ్యిందని.
అయినా కానీ ఆ వేలం తన జీవితాన్ని మార్చేస్తుందని తనకు ముందే తెలుసునని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ తన జీవితంలో పెను మార్పులు తీసుకు వస్తుందని తెలియజేశాడు.తనని 14 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసినట్లు తెలియగానే తనలో ఉత్సాహం రెట్టింపు అయ్యిందని అది నాకు ఒక భావోద్వేగ క్షణం అని తెలియజేశాడు.ఆ క్షణం తనకి భవిష్యత్తుకు మంచి ఆధారమని తాను ఒక క్రికెటర్ గా ఆడి ఆర్థిక భద్రత లభించపోతున్నట్లు తెలిపాడు.
వీటితో పాటు సాధారణంగా తమలాంటి ఆటగాళ్ల కెరియర్ ఐదు నుంచి పది సంవత్సరాల వరకు కొనసాగుతుందని ఈ సమయంలోనే తాము ఆర్థికంగా స్థిరపడాలని తెలిపాడు.
తనను పంజాబ్ కింగ్స్ జట్టు ఇంత ధర పెట్టి కొన్నందుకు తనపై ఆ జట్టుకు ఎంత అంచనాలు ఉంటాయో తెలుసునని అదే స్థాయిలో తాను ఆడతానని తెలియజేశారు. తాను ఒక క్రికెటర్ గా ఎలాంటి సవాళ్లకు అయినా ఎదురొడ్డి ఉండటానికి ఎప్పుడూ సిద్ధమేనని తెలియజేశాడు.కేవలం నా నైపుణ్యాలు తాను ఆడే జట్టుకు ఎంతవరకు ఉపయోగపడతాయో మాత్రమే చూస్తానని తెలుపుతూనే భారత్ లో తన సామర్ధ్యం నిరూపించుకోగలనా లేదా అన్నది ప్రస్తుతం తనపై ఉన్న సవాల్ అంటూ రిచర్డ్సన్ తెలిపారు.