కరోనా మహమ్మారి నుంచీ అమెరికా మెల్ల మెల్లగా కోలుకుంటోంది అనుకున్న తరుణంలో అమెరికాలో ఎదో ఒక చోట మళ్ళీ కరోనా తన ప్రభావం చూపుతోంది.ఇప్పటి వరకూ కరోన కారణంగా 83 వేల మంది మృతి చెందగా.14 లక్షల మంది కరోనాతో పోరాడుతున్నారు.ఇదిలాఉంటే న్యూయార్క్ కట్టుదిట్టమైన చర్యల కారణంగా మహమ్మారి తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.
స్వచ్చందంగా ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు.
అయితే కరోనా మహమ్మారి లక్షణాలు బయట పడితే ఎవరికీ వారు స్వచ్చందంగా వచ్చి బయటకి చెప్పే పరిస్థితులు ఎక్కడా కన్పించడంలేదు.
కరోన బాధితులకి ప్రైమరీ కాంటాక్టులమని తెలిసినా కూడా వైరస్ లక్షణాలు కనిపించక పొతే ఎవరూ భయపడి బయటకి చెప్పుకోవడంలేదు.ఇదే పరిస్థితి కొనసాగితే న్యూయార్క్ లో కరోనా ఎప్పటికి తగ్గే అవకాశం లేదని చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు నిపుణులు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
కరోనా అనుమానితులని గుర్తించడానికి ప్రభుత్వం గూడచారులని నియమించింది.కొత్తగా ఎవరైనా కరోనా బారినపడిన వారు అప్పటి వరకూ సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం వీరు చేయాల్సిన విధులు.న్యూయార్క్ లో పూర్తిగా అదుపులోకి వచ్చిన ఈ మహమ్మారి మళ్ళీ వ్యాపించకుండా ఉండాలంటే తప్పకుండా ఈ చర్యలు ఎంతో ఉపయోగపడుతాయని అంటున్నారు నిపుణులు.
గూడచారులు కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ లో శిక్షణ కూడా నిర్వహిస్తున్నారు.