బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రపంచ సుందరిగా పేరు గడించిన ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న ఈ జంట నిజజీవితంలో కూడా ఈ జంటను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఐశ్వర్య అభిషేక్ వైవాహిక జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది.ఐశ్వర్యకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది మాత్రం న్యూయార్క్ హోటల్ అని చెప్పవచ్చు.
అసలు ఆ హోటల్లో ఏం జరిగింది.హోటల్ కి ఐశ్వర్య జీవితానికి సంబంధం ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.
ఐశ్వర్య రాయ్ తన మొదటి చిత్రం ‘ఔర్ ప్యార్ హోగయా‘ చిత్ర షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు అక్కడే అభిషేక్ హీరోగా తెరకెక్కుతున్న ‘మేజర్ సాబ్‘ షూటింగ్ జరుగుతోంది.ఈ క్రమంలోనే అభిషేక్ అక్కడ ఉన్నప్పటికీ ఐశ్వర్యరాయ్ వారికి ఎంతో దూరంలో కూర్చుని ఉండేవాడు.
ఈ క్రమంలోనే ఆమె చొరవ తీసుకొని వారితో పాటు కలిసి కూర్చోవాల్సి ఉందిగా తెలియజేసింది.ఆ తర్వాత వీరిద్దరు జంటగా ‘ఢాయీ అక్షర్ ప్రేమ్ కే’ అనే సినిమా ద్వారా మరోసారి కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఐశ్వర్య అభిషేక్ ఇద్దరూ కలిసి గురు మూవీ స్క్రీనింగ్ కోసం న్యూయార్క్ వెళ్లారు.ఆ తర్వాత వీరిద్దరూ వారు ఉన్నటువంటి హోటల్ కి తిరిగి వెళ్లారు.హోటల్ కి వెళ్లి ఐశ్వర్య ఫ్రెష్ అయ్యి షూస్ జిప్ వేసుకుంటుండగా అభిషేక్ ఆమెను బాల్కనీలోకి పిలిచారు.బయటకు వెళ్లిన ఐశ్వర్యకు అభిషేక్ ఎంతో సింపుల్ గా మోకాళ్లపై కూర్చుని తన చేతికి ఉంగరం తొడుగుతూ తన పై ఉన్న ప్రేమను వ్యక్త పరిచాడు.
ఆ రోజు అభిషేక్ చెప్పిన ప్రతి విషయం తను వ్యక్తపరచిన ప్రేమ ఇప్పటికీ తన మదిలో ఉందని ఐశ్వర్య ఓ సందర్భంలో తెలియజేశారు.
ఆ విధంగా అభిషేక్ ప్రపోజ్ చేయడంతో ఏ మాత్రం ఆలోచించకుండా తన ప్రేమను అంగీకరించానని ఆ తర్వాత పెద్దల సమక్షంలో వారి పెళ్లి జరిగిందని చెప్పవచ్చు.ఒకవేళ అభిషేక్ తనకు ప్రపోజ్ చేయకపోతే తనే చొరవ తీసుకుని తన ప్రేమను వ్యక్తపరిచే దానిని తెలిపారు.2007లో పెళ్లి బంధం ద్వారా ఒకటైన ఈ జంటకు 2011లో ఆరాధ్య అనే కూతురు పుట్టింది.ఈ విధంగా న్యూయార్క్ హోటల్ ఐశ్వర్య జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు.