న్యూ ఇయర్ 2021 సందర్భంగా జియో సంస్థ తన కస్టమర్ల కోసం ఒక శుభవార్త తెలియజేసింది.ఈ తరుణంలో దేశంలో జియో నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్క్ కు ఎప్పుడైనా, ఏ సమయంలో అయినా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు అని తెలిపింది.
గతంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ (ట్రాయ్) ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జిలను వసూలు చేయాలని అన్ని టెలికామ్ సంస్థలకు తెలియ చేసిన నేపథ్యంలో జియో సంస్థ కూడా తన కస్టమర్ల నుంచి కొంత మొత్తం చార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది.
అందుకోసం అ సమయంలో కేవలం జియో టు జియో మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించింది.
ఇతర నెట్వర్క్ కులకు కాల్ చేసినప్పుడు చార్జీలు వసూలు చేసుకుంటూ వచ్చింది.ఇక ట్రాయ్ జనవరి 1, 2021 నుంచి ఈ చార్జీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో జియో సంస్థ కూడా వారి కస్టమర్ల కోసం జియో నుంచి ఇతర నెట్వర్క్లకు ఉచిత కాల్స్ ను అందచేస్తునట్లు తెలియజేసింది.
ఈ విధానం జనవరి 1 నుంచి అమలు అవ్వబోతున్నట్లు జియో సంస్థ తెలియజేసింది.ఈ తరుణంలో జియో కస్టమర్లు ఎప్పటి లాగానే ఇతర నెట్వర్క్లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ట్రాయ్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక మంది జియో కస్టమర్ లకు మేలు జరగబోతుంది.అంతేకాకుండా జియో తన కస్టమర్లకు ఎప్పటి లాగానే నాణ్యమైన సేవలు అందించడంతో పాటు కస్టమర్ల సౌకర్యాలను కల్పించేందుకు కూడా కృషి చేస్తామని అధికారులు తెలయజేశారు.