తాజాగా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.గత మూడు రోజుల క్రితం ఈ అప్డేట్లను యూజర్స్ కు అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ కొత్త అప్డేట్స్ లో మల్టిపుల్ పిన్నెడ్ మెసేజెస్ అలాగే లైవ్ లొకేషన్ 2.0, అలాగే ఈజి మ్యూజిక్ ప్లే షేరింగ్ లాంటి కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.వీటితో పాటు మరింత సులభ కరమైన చాటింగ్ అనుభూతిని అందుబాటులోకి తీసుకువచ్చారు.అలాగే మల్టిపుల్ పిన్ మెసేజ్స్ పిన్నెడ్ చేసిన సందేశాలను మార్చుకునేందుకు వీలు కల్పించారు.
సమాచార మార్పిడి పై సభ్యుల దృష్టిని ఆకర్షించడానికి ఎటువంటి పిన్ అవసరం లేదు.పెద్ద పెద్ద మెసేజ్లు పంపకుండా దాని నిర్వాహకులు చిన్నచిన్న వర్షన్స్ గా విభజించి వాటిని పంపించేందుకు వీలు కల్పించారు.
అలాగే కొత్తగా ‘వన్ ఆన్ వన్ చాట్ ‘ గ్రూపులుగా ఛానల్ లో ఈ లక్ష్యాన్ని మొదలుపెట్టింది.ఇక ఇందుకోసం రైట్ కార్నర్ లో ఉన్న బటన్ ను ఎంచుకొని అందులో వినియోగదారులు చేసిన సందేశాలను చూడవచ్చు.అలాగే లైవ్ లొకేషన్ 2.0 ఫీచర్ మెరుగైన వెర్షన్ కు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇలా కొత్త అప్డేట్ లతో ప్రత్యేకత అందుబాటులోకి తీసుకువచ్చింది టెలిగ్రామ్.టెలిగ్రామ్ లో కొత్తగా ప్లే లిస్ట్ ను తీసుకువచ్చారు.ఇందులో ఒకేసారి అనేక పాటలను ప్లే లిస్ట్ రూపంలో మిత్రులకు పంపించవచ్చు.ఇలా ఒక వ్యక్తి మరో వ్యక్తి తో షేర్ చేసినప్పుడు ఆ పాటలు ఒక లిస్టుగా మారిపోతాయి.
ఒక మెసేజ్ ను ఇతర ఛానల్ కు ఎన్ని సార్లు ఫార్వర్డ్ చేశారో కూడా కొత్తగా ఈ ఆప్షన్ ను తీసుకువచ్చారు.ఈ కొత్త వర్షన్ లో హాలో విన్ అనిమేటెడ్ యానిమేషన్ లను పరిచయం చేశారు.