కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వాహన చట్టంను పలు రాష్ట్రాలు పాటించడం లేదు.కొన్ని రాష్ట్రాల్లో పాటించడం వల్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఆ కారణంగా పలు రాష్ట్రాల వారు ఆ వాహన చట్టంను అమలు చేసేందుకు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర కొత్త జరిమాన విధానాలను పాటించే ఆలోచన లేదని తేల్చి చెప్పింది.
అయితే ఏపీ మాత్రం కేంద్రం తెచ్చిన కొత్త చట్టంను పూర్తిగా కొట్టేయకుండా, పూర్తిగా వాహనదారులపై భారం వేయకుండా మద్యస్థంగా ప్రవర్తించింది.ఏపీలో వాహనదారులు చెల్లించాల్సిన కొత్త చలానాలు ఇలా ఉండబోతున్నాయి. రోడ్డు నిబంధన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే – రూ.2500 సీట్ బెల్ట్ – రూ.500 అర్హత లేకుండా వాహనం నడిపితే – రూ.4000 ఇన్సూరెన్స్ లేకుంటే – రూ.1250 ఓవర్ సైజ్డ్ వాహనాలు – రూ.1000 అతిక్రమిస్తే – రూ.250 డేంజరస్ డ్రైవింగ్ – రూ.2500 డ్రంక్ అండ్ డ్రైవ్ – రూ.5000