త్రివిక్రమ్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అల…వైకుంఠపురములో.ఈ చిత్రం సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 3 పాటలు రిలీజ్ చేయగా అన్నిటికి కూడా రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
సామాజవరాగమనా,రాములో రాములా,ఓ మై గాడ్ డాడీ అనే సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా బుట్ట బొమ్మ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు.
రెండు రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ టీజర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయారు.దీనితో ఈ రోజు ఈ బుట్ట బొమ్మ టీజర్ ని రిలీజ్ చేశారు.
రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ అందించగా, ఆర్మాన్ మాలిక్ పాట పాడారు.ఈ సాంగ్ కూడా సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది.ఫుల్ సాంగ్ డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.
అలానే ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకి థమన్.ఎస్ సంగీతం అందిస్తున్నారు.