అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో హోటల్ షెరెటాన్లో అమెరికన్ తెలంగాణా అసోసియేషన్ బోర్డు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆటా తెలంగాణా అసోసియేషన్ కి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.
ఈ సమావేశానికి సంస్థ మాజీ నాయకులు, ప్రస్తుత నాయకులు అందరూ హాజరయ్యారు.ఈ సందర్భంగా బోర్డ్ కొన్ని కొత్త అంశాలని అజెండాగా పెట్టుకుంది.
దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి కొన్ని తీర్మానాలని ఆమోదించారు
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక నుంచీ ఈ అసోసియేషన్ ని ఆటా తెలంగాణ పేరుతో పిలవాలని గతంలో కేవలం ఆటా అని మాత్రమే ఉండేదని ఇప్పుడు ఆటా తెలంగాణా గా మార్చామని తీర్మానం చేశారు.ఆటా తెలంగాణా పేరుమీదనే ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించుకున్నారు.
సంస్థ ఇప్పటి వరకూ చేపట్టిన సామజిక కార్యక్రమాలు, ఆశయాలు, ఈ కార్యక్రమాలు నిర్వహణకి తోడ్పడిన సంస్థ సభ్యుల సహకారాలన్నీ మర్చిపోలేనివని చైర్మన్ కరుణాకర్ మాధవరం ధన్యవాదాలు తెలియజేశారు
రెండేళ్ళ కాలంలో సంస్థ తరుపున నిర్వహించిన ప్రతీ ఒక్క కార్యక్రమాని వివరించి చెప్పారు.అలాగే నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన వినోద్ కుకునూరు భవిష్యత్తులో తానూ చేపట్టబోయే కార్యక్రమాలని వివరించారు
నూతన కార్యవర్గం 2019-20
మాధవరం కరుణాకర్ – చైర్మన్వినోద్ కుకునూర్ – ప్రెసిడెంట్నరేందర్ చేమర్ల – ప్రెసిడెంట్ ఎలక్ట్సత్యనారాయణ రెడ్డి కందిమళ్ళ – పాస్ట్ ప్రెసిడెంట్వెంకట్ మంతెన – ప్రధాన కార్యదర్శిరామచంద్రారెడ్డి – కోశాధికారిచందుతాళ్ళ – ఉప కార్యదర్శిశ్రీనివాస్ రెడ్డి బండారపు – ఉపకోశాధికారి
అడ్వయిజరీ కమిటీ
కరుణాకర్ మాధవరం, జిఎల్ఎన్ రెడ్డి, సత్యనారాయణరెడ్డి కందిమళ్ళ, డా.గునిగంటి ప్రభాకర్ రావు, డా.రాజ్ గంగినేని, డా.భాస్కర్ వేనెపల్లి
నేషనల్ కో ఆర్డినేటర్గా రవి దన్నపునేని,
కల్చరల్ అడ్వయిజర్గా డా.పద్మజారెడ్డి,
ఓవర్సీస్ అడ్వయిజర్గా రామచంద్రారెడ్డి భానపురంనియమింపబడ్డారు.