మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.అంతా అయిపోయింది వైరస్ పై విజయం సాధించేశాం దేశంలో అందరికీ వ్యాక్సిన్లు అందాయి అని అనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్లు పుట్టుకురావడ ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారింది.
ఇదిలా ఉంటే భారత్ లో కరోనా ఫస్ట్ వేవ్ సమర్థవంతంగా ఎదుర్కొన్సె కండ్ వేవ్ మాత్రం ఇండియా ని హాడలెత్తించింది.భారీగా మరణాలు సంభవించడం తోపాటు రోజుకి లక్షల లో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది.
అయితే కొద్ది వారాల క్రితం నుండి వైరస్ తీవ్రత తగ్గడంత సాధారణ పరిస్థితులోకి దేశం వచ్చింది అన్న లోపే మళ్లీ ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు కేంద్ర పెద్దలు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు.మరోపక్క కేరళ రాష్ట్రంలో ఊహించనివిధంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోవడంతో అక్కడ లాక్ డౌన్ అమలు చేసే పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా డెల్టా వేరియంట్ భారీగా విజృంభిస్తున్నట్లూ వార్తలు వస్తున్న తరుణంలో థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు కేంద్రం నుండి వస్తున్న నేపథ్యంలో ఏపీలో విశాఖ బీచ్ ల సరికొత్త అంశాలు జిల్లా అధికారులు విధించడం జరిగింది.మేటర్ లోకి వెళ్తే శని ఆదివారాలలో వీకెండ్ లలో విశాఖ బీచ్ కి జనాలు పోటెత్తుతున్న నేపథ్యంలో శని ఆదివారాలు విశాఖ బీచ్ రోడ్డు లోకి ఎవరు రాకుండా ఆంక్షలు విధించనున్నారు.ఈ విషయాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.