జులై 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను ఆధార్ కు సంబంధించి సరికొత్త రూల్స్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆధార్ ప్రాముఖ్యత మరింత పెరిగిపోయింది.
ప్రస్తుతం మూడు కీలకమైన అంశాలలో ఆధార్ ఖచ్చితంగా మారిపోయింది.ఒకవేళ ఆధార్ నెంబరు ఇవ్వకపోతే ఇక నుంచి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం కుదరదు. అంతేకాకుండా పాన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలన్న ప్యాన్ కార్డును పొందాలన్న ఈ ఆధార్ కార్డు జత చేయడం తప్పనిసరి గా మారిపోయింది.అంతేకాకుండా ప్రస్తుతం పాస్పోర్ట్ తీసుకోవడానికి కూడా ఆధార్ నెంబర్ తప్పనిసరి అనే సరి కొత్త నిబంధన కూడా అమలులోకి వచ్చింది, జులై 1వ తేదీ నుంచి ఎవరైనా పాస్పోర్ట్ తీసుకోవాలనుకునే వారు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది.
ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకోగా ఆధార్ ఆవశ్యకత మరింత పెరిగింది.ఇక ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కి కూడా ఆధార్ తప్పనిసరి అని మరో కొత్త రూమ్ అమల్లోకి వచ్చింది.
ఇక ఆధార్ నెంబర్ ని ప్రోవిడెంట్ ఫండ్ ఎకౌంటు తో జత చేయడం కారణంగా సులభంగా డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి వీలుంటుంది.