ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని తీరు వేరు అని అందరికీ తెలుసు.ప్రతిపక్ష నేత చంద్రబాబు ని విమర్శించాలన్న, టిడిపి నాయకులను ఏకి పారేయాలన్న వైసీపీ నుండి రంగంలోకి దిగేది ఎక్కువగా కొడాలి నాని యే.
ఇదిలా ఉంటే త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.కొడాలి నాని కి కొత్త బాధ్యతలు అప్పగించారు జగన్.
పంచాయతీ ఎన్నికలలో దాదాపు క్లీన్ స్వీప్ అన్న తరహాలో వైసిపి పల్లెల్లో గెలవడం అందరికీ తెలిసిందే.
పట్టణాల్లో కూడా అదే రీతిలో గెలిచే విధంగా వ్యూహాలు వేస్తూ ఉన్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
దీంతో కృష్ణా జిల్లాలో కీలక నేతగా రాణిస్తున్న కొడాలి నానికి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకులుగా కొత్త బాధ్యతలు అప్పగించారు అధినేత జగన్.కృష్ణా జిల్లాలో విజయవాడ కీలకం కావటంతో.ఖచ్చితంగా నగరంలో మేయర్ స్థానం వైసీపీ కే దక్కాలని.అందువల్ల జిల్లా రాజకీయాలలో పట్టున్న నేతగా కొడాలి నానికి మంచి పేరు ఉండటంతో బాధ్యతలు.ఆయనకు అప్పగించినట్లు వార్తలు పార్టీలో వినబడుతున్నాయి.