ప్రజాస్వామ్యం ఎంత వింతగా మారిపోయింది అంటే.ఎవరికి కోపం వస్తే వారు పార్టీ పెట్టేయ్యడం…ఎన్నికల్లో పోటీ చేసేయ్యడం…గెలిచిన అభ్యర్థులతో పెద్ద పార్టీలో విలీనం చేసేయ్యడం.
ఇదీ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం.ఇదంతా పక్కన పెడితే…మొన్న సీమాంధ్రలో చిరు తన వర్గాన్ని కాపాడుకోవడానికి, లేదా రెండు వర్గాల ఆదిపత్యాన్ని విడగొట్టి తాము సైతం అధికారానికి అతీతులు కామూ అంటూ చేసిన ప్రయత్నం మరువక ముందే.
ఇప్పుడు అదే క్రమంలో తెలంగాణాలో సైతం అలాంటి పార్టీ ప్రాణం పోసుకోనుంది.విషయం ఏమిటంటే.
బీ.సీ నేత ఆర్.కృష్ణయ్య సైకోత్త పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఒక్క బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలు సైతం తమదిగా భావించేలా పార్టీ పేరు ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో బాగా ప్రచారం పొంది, అన్ని వర్గాల ప్రజలను కదిలించి ఏకం చేసిన సకల జనుల సమ్మె కార్యక్రమాన్ని ఆద ర్శంగా తీసుకుని పార్టీ పేరును సకల జనుల పార్టీ(ఎస్జేపీ) అని పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమా చారం.అది కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ లాగా బహుజన్ అద్మీ పార్టీ(బీఏపీ) అని పెట్టే అవకాశం ఉంది.పార్టీ పేరు కోసం నవంబర్లో కేంద్ర ఎలక్షన్ కమిషన్లో రిజిస్ట్రేషన్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.2019 జరిగే ఎన్నికల కంటే కనీసం మూడు సంవత్సరాల ముందు నుంచే తమ పార్టీ కార్యక్ర మాలను చేపట్టేలా ఉండాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో 52 శాతం బీసీలు ఉన్నారు.సగా నికి పైగా జనాభా ఉన్న బీసీల్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలేదని, అందుకే బీసీ ఉద్యమ నేత సీఎం కావాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారని బీసీనేతలు చెబుతున్నారు.
మరి ఇప్పటికే మెగా పార్టీలు ఎన్నో ఊపిరాడక పెద్ద పార్టీల్లో విలీనం అయిపోతే మరి ఈ కొత్త పార్టీ ఎలా మనుగడ సాగిస్తుందో చూడాలి.