అధికార పార్టీ అంటే కచ్చితంగా అభివృద్ధి అనేది ప్రజల్లో కామన్ ఎక్స్ పెక్టేషన్.ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో అయితే ఇది కాస్తా రివర్స్ అవుతోంది.
వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు.ఇందులో చాలామంది కొత్తగా గెలిచిన వారే ఉన్నారు.
అప్పటికప్పుడు కొందరిని తెరమీదకు తీసుకువచ్చిన జగన్ వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు.ఇలా జగన్ వేవ్ కారణంగా గెలిచిన వారంతా ఇప్పుడు ఎందుకో రిలాక్స్ అయిపోయినట్టు కనిపిస్తోంది.
ఇందులో దాదాపు 100 మంది ఎమ్మెల్యేలకు జగన్తో సంబంధం లేకుండా పోయింది.
కనీసం జగన్తో మాట్లాడి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఓ క్లారిటీ లేకుండా పోయింది.
దీంతో వారంతా నిధులు లేక, దిశా నిర్దేశం చేసేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు.దాదాపు రెండున్నరేండ్లుగా వారికి జగన్ అపాయింట్ మెంట్ దొరక్క వెయిట్ చేస్తున్నారు.
కరోనా వచ్చిన తర్వాత వారి పరిస్థితి మరింత దారుణంగా తయారయింది.ఇప్పుడు మరోసారి జగన్ గెలుస్తాడనే ప్రచారంతో చాలామంది ఎమ్మెల్యేలకు పోటీ మొదలవుతోంది.
వారికి పోటీగా చాలామంది వైసీపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.దీంతో కొత్తగా గెలిచిన వారంతా ఇప్పుడు నిరాశలోనే ఉంటున్నారు.
నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు చేసి తమకంటూ ప్రత్యేకమైన పేరు, గుర్తింపు తెచ్చుకుందామా అంటే నిధులు లేని పరిస్థితి.కనీసం రోడ్లు వేయించలేక ప్రజల్లో తిరగాలంటేనే వెనకడుగు వేస్తున్నారు చాలామంది.రెండున్నరేండ్లు గడిచిపోతున్నా కూడా పెద్దగా అభివృద్ధి పనులు చేయించలేక ఇబ్బందులు పడుతున్నారు.ఓ వైపేమో ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది.నిధులు లేక వెలవెల బోతోంది.దీంతో ఇప్పుడు వీరికి నిధులు కేటాయించే పరిస్థితుల్లో జగన్ లేరనే చెప్పాలి.
వారు మాత్రం ఏ చిన్న అవకాశం వచ్చినా తమ గోడునంతా వెల్లబోసుకోవాలని చూస్తున్నారు.