ఛలో చిత్రంతో వచ్చిన సక్సెస్ను వెంకీ కుడుముల భీష్మతో కంటిన్యూ చేశాడు.నితిన్తో చేసిన భీష్మ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ను దక్కించుకున్న విషయం తెల్సిందే.
దాంతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లను దక్కించుకున్న వెంకీ కుడుముల వెంట యంగ్ హీరోలు పడుతున్నారట.ప్రస్తుతానికి వెంకీ కుడుముల మూడవ సినిమా ఫిక్స్ కాలేదు.
కాని ప్రముఖ నిర్మాత భారీ పారితోషికం ఆఫర్ చేసి మెగా హీరోకు బుక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దిల్ రాజు ఇటీవలే వెంకీ కుడుములతో మాట్లాడాడు అని, ఆయన మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
వైష్ణవ్ రెండవ సినిమాను దిల్రాజు నిర్మించాలని కమిట్ అయ్యాడు.అయితే ఇప్పటి వరకు దర్శకుడు ఎవరు అనేది క్లారిటీ రాలేదు.వెంకీని ఈ విషయమై సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒకవేళ వెంకీ కుడుముల దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ మూవీ వస్తే మాత్రం మెగా హీరోకు రెండవ సినిమాతోనే మంచి క్రేజ్ దక్కడం ఖాయం అంటున్నారు.ఛలో, భీష్మ చిత్రాల తర్వాత వెంకీ హ్యాట్రిక్గా వైష్ణవ్ తేజ్తో హ్యాట్రిక్ కొడతాడా లేదంటే మరో హీరోతో సినిమాను చేస్తాడా అనేది చూడాలి.