ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో అనేక వివాదాలు నడుస్తున్నాయి.సీనియర్లు అంతా కూడా రేవంత్ మీద గుర్రుగా ఉంటున్నారు.
బాహాటంగాను తమ నిరసనను తెలుపుతున్నారు.గ్రూపు రాజకీయాలు కూడా చాలానే పెరిగిపోతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిగాలని చూస్తున్న కాంగ్రెస్ లో మరో చిక్కు తెరమీదకు వచ్చి పడింది.అదే కుటుంబంలో ఒకరికే టికెట్ అనే అంశం.
కాంగ్రెస్ లో ఈ అంశం ఎప్పటి నుంచో వినిపిస్తోంది.కానీ ఇన్ని రోజులు కొంచెం సైలెంట్ గానే ఉంది.
ఇప్పుడు మాత్రం చాలా హాట్ టాపిక్ అవుతోంది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు పార్టీలో ఉన్న ఎవరికైనా కుటుంబంలో ఒకరికే టికెట్ ఇస్తారని తెలుస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే పార్టీ నేతలకు, శ్రేణులకు ప్రతిపాదనలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.అయితే ఇది కొత్త ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మనసులో ఉన్న ఆలోచనగా తెలుస్తోంది.
ఇదే నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నారంట.కాగా ఈ అంశం తనకు వ్యతిరేక గళం వినిపిస్తున్న సీనియర్లకు చెక్ పెట్టేందుకు తెస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
జగ్గారెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్, ఉత్తమ్, జానారెడ్డి లాంటి సీనియర్ల ఇండ్లలో ఒకరి కంటే ఎక్కువ మందికి టికెట్లు ఇస్తున్నారు.
కాబట్టి వీరందరికీ తన ఎత్తుగడతో చెక్ పెట్టేయొచ్చనే ఆలోచనతో రేవంత్ ఇలాంటివి తెరమీదకు తెస్తున్నారని సీనియర్లు చాలా ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే సీనియర్లు రేవంత్ మీద చాలా కోపంగా ఉన్నారు.ఇలాంటి ప్రతిపాదనలు తెచ్చి తమ వారసులకు, సతీమణులకు టికెట్లు ఇవ్వకుండా చేస్తున్నారని రేవంత్ మీద గుస్సా అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
కాబట్టి ఇది కాంగ్రెస్ లో అసంతృప్తి మంటలు రేపుతుందని నిపుణులు వివరిస్తున్నారు.కొత్త వారిని ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదే అయినా.
అందరూ ఆహ్వానిస్తారా లేదా అన్నది చూడాలి.