కన్నడ సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.
ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్తో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.ఇప్పటికే ఎక్కువ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
కేవలం కొంతమేర మాత్రమే సినిమా షూటంగ్ మిగిలి ఉండటంతో ఈ సినిమా షూటింగ్ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ను ఆగష్టు 15న తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కేవలం 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిల ఉండటంతో వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్తో తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
యశ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోండగా, బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్ కీలక పాత్రలో నటిస్తోంది.ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
మరి కేజీఎఫ్ 2 ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం సంక్రాంతి వరకు ఆగాల్సిందే.