అసలు ఈ కరోనా వైరస్ పుట్టుక రహస్యం ఏంటో ఇప్పటికి ప్రపంచ దేశాలు కనిపెట్టలేక పొతున్నాయి.చైనా నుండే ఈ వైరస్ వ్యాప్తి జరిగిందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో బలమైన ఆధారాలు లేక కేవలం ఆరోపణలతోనే మిన్నకుండిపోయాయి.
కానీ ఈ కరోనా ఇంతటితో ఆగలేదు.రెండో వేవ్ అంటూ పేదల రెక్కలు ముక్కలు చేసింది.ఎందరో మరణాలకు కేరాఫ్ గా మారింది.ఒకరకంగా భయంకరమైన ప్రళయాన్ని సృష్టించిందని చెప్పవచ్చూ.
ఇదిలా కొనసాగుతుండగానే, త్వరలో మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందనే వార్తలు జనాన్ని కలవర పెడుతున్నాయి.దీనికి తోడూ ఫంగస్లు కూడా విజృంభిస్తున్నాయి.
ఈ క్రమంలో కొత్త వేరియంట్ ను వియత్నాం పరిశోధకులు గుర్తించారు.ఈ వేరియంట్ మిగతా వాటికంటే అమిత వేగంతో గాల్లో కూడా వ్యాపిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు.
కాగా ఈ మ్యుటేషన్ ఎంతో ప్రమాదకరమైనదని భావిస్తున్నామని వారు తెలిపారు.