దేశవ్యాప్తంగా మళ్ళీ కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విధ్వంసం కి.
దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీగానే వైరస్ తీవ్రత అప్పట్లో నెలకొంది.
దీంతో తర్వాత వైరస్ తీవ్రత తగ్గటంతో తాజాగా మళ్లీ కేసులు కొన్ని రాష్ట్రాలలో పెరుగుతుండటంతో ఏపీలో కరోనా కొత్త రూల్స్ ప్రభుత్వం తీసుకు రావటం జరిగింది.
మేటర్ లోకి వెళ్తే శుభకార్యాల తో పాటు.
మతపరమైన సమావేశాలకు సంబంధించి పాల్గొనే వారి సంఖ్య 150 కి మించకూడదని తెలిపింది.కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని వేదికపై ఒకేచోట.సీట్లు ఉంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి కూర్చోవాలని.ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.కనీసం కుర్చీ కి మరో కుర్చీకి మధ్య ఐదు అడుగుల దూరం ఉండాలని.తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజాగా ఈ కొత్త మార్గదర్శకాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ జారీ చేయడం జరిగింది.