దేశంలో మళ్లీ వింజృభిస్తున్న కరోనా వల్ల ప్రభుత్వాలతో పాటుగా, ప్రజల్లో కూడా భయాందోళనలు మొదలవుతున్నాయి.ఇప్పటికే వరుసగా కోవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో కొన్ని చోట్ల లాక్డౌన్ కూడా అమలు చేస్తున్నారు.
స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటిస్తున్నారు.
ఇక ఈసారి గనుక కరోనా వ్యాపించడం మొదలు పెడితే ఎదురయ్యే పరిస్దితులను తట్టుకునే శక్తి ప్రజల్లో లేదనే విషయం సృష్టంగా కనిపిస్తుంది.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా ఊహించని విధంగా కరోనా కేసులు నమెదు అవుతున్నాయి.కాగా వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.
ఆ వివరాలు చూస్తే.దేశంలో గత 24 గంటల్లో 43,846 మందికి కరోనా నిర్ధారణ అయిందని.
ఇందులో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారని వెల్లడించింది.దీంతో మృతుల సంఖ్య 1,59,755కు పెరిగింది.
కాగా కరోనా బారి నుండి 22,956 మంది కోలుకోగా, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు చేరిందని ఆరోగ్యశాఖ వివరించింది.