సమాజంలో రోజు రోజుకు సరికొత్త రీతిలో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటాం అనే చందాగా కేటుగాళ్లూ పుట్టుకొస్తున్నారు.
ఇక మోసం చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని మార్గాలను ఎంచుకుంటున్నారు నేరస్తులు.
ప్రజలు ఈ పరిస్దితుల్లో ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా వారి జేబుకు చిల్లులు పడటం ఖాయం.
ఇక ప్రస్తుతం ఒక ప్రముఖ చానల్లో ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మంచిర్యాల పోలీసులు పట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆముదాల సంపత్ రెడ్డి, పులి వెంకట్ రావు అనే ఇద్దరు యువకులు ఒక చానల్ నకిలీ గుర్తింపు కార్డ్లతో పాటుగా, ఆ న్యూస్ చానల్ లోగో, పేరు ఉపయోగించుకొని మంచిర్యాలలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తు నిరుద్యోగ యువతి యువకులను మోసం చేయాలని ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది, పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరపగా ఆ విచారణలో నేరం రుజువు అవ్వడంతో వారిని జైలుకు తరలించారు.
కాబట్టి ప్రతి వారు అపరిచితుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, ఎవరిపట్ల అయినా అనుమానం కలిగితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా పోలీస్ అధికారులు తెలియచేస్తున్నారు.