దాదాపు రెండు సంవత్సరాల పాటు వెండితెరపై కనిపించకుండా రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిన పవన్ “వకీల్ సాబ్” తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ “పింక్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన “వకీల్ సాబ్” పై మెగా అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీగా ఉంది.మరోపక్క ఎప్పటిలాగానే ఈ టీజర్ తో సరికొత్త రికార్డులు సృష్టించాలని పవన్ అభిమానులు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు.ఇలాంటి తరుణంలో సినిమాకి సంబంధించి సరికొత్త మార్పు ఒకటి చోటు చేసుకున్నట్లు ఫిలిం వర్గాల టాక్.
మేటర్ ఏమిటంటే “వకీల్ సాబ్” శాటిలైట్ రైట్స్ మొదటిలో జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా జెమినీ టీవీ వెనకడుగు వేయడంతో జీ తెలుగు “వకీల్ సాబ్” శాటిలైట్ రైట్స్ దక్కించుకునట్లుగా తెలుస్తోంది.
దాదాపు 15 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఒక శాటిలైట్ రైట్స్ మాత్రమేగాక థియేట్రికల్ రైట్స్ కూడా భారీ స్థాయిలోనే బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.
మొత్తంమీద చూసుకుంటే “వకీల్ సాబ్” నిర్మాత దిల్ రాజు.భారీగానే లాభాలు పవన్ రీఎంట్రీ సినిమాతో సాధిస్తున్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది.