తెలంగాణ, ఏపీలో పార్టీ బలోపేతం కోసం ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకోనుంది.ఈ మేరకు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు త్వరలో మరో బాస్ రానున్నారని తెలుస్తోంది.
ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించిన తరువాత కార్యవర్గాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పాత ఇంచార్జ్ లు పలువురు రాజీనామాలు చేశారు.
ఇటు తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ను కూడా మార్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ, ఏపీకి కలిపి సూపర్ పీసీసీ పేరిట కొత్త బాస్ ను నియమించనున్నారనే వార్తలు జోరందుకున్నాయి.
ఇందుకు గానూ 2014 నుంచి ఇప్పటివరకు పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ నివేదిక రూపొందించింది.లీడర్ల కంటే క్యాడర్ పోవడంతో పార్టీకి నష్టం జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితిపై దృష్టిసారించిన ఖర్గే ఢిల్లీలో టీకాంగ్ సీనియర్ నేతలతో మంతనాలు చేస్తున్నారని సమాచారం.