అప్పుడే పుట్టిన శిశువులను చెత్త కుప్పలో పడవేసిన ఘటనలు గతంలో ఎన్నో తెరమీదకు వచ్చాయి.కళ్ళు తెరిచి ఇంకా లోకాన్ని కూడా చూడని శిశువులను నిర్దయగా చెత్తకుండీలో రోడ్లపై పడేసిన ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేశాయి.
అయితే గత కొన్ని రోజుల నుంచి ఇలాంటి ఘటనలు కాస్త తగ్గాయి అనే చెప్పాలి.
అయితే తాజాగా ఇలాంటి ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇంకా కళ్ళు కూడా తెరవని చిన్నారి ని రోడ్డుపై నిర్దయగా వదిలేశారు.నగరంలోని అంబర్పేట్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అంబర్పేట్ పోలీసులు శిశువును నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది శిశువు.
అంబర్పేట్ ప్రాంతంలోని పటేల్ నగర్ లో నివాసముండే అనిల్ కుమార్ గౌడ్ తన ఇంటి గేటు వద్ద పసికందు ఏడుపు వినిపించటంతో ఏంటా అని గమనించగా ఓ చీరలో కట్టి పసికందు ఉంది.
దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.ఇక హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు శిశువును వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా.పరీక్షించిన వైద్యులు శిశువు మరణించినట్లు ధ్రువీకరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.