కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ అభం శుభం తెలియని ఎంతో మందిని బలి తీసుకుంటుంది.అంతే కాదు ఏకంగా అప్పుడే పుట్టి ఇంకా లోకాన్ని కూడా చూడని శిశువులను కూడా కరోనా కబళిస్తోంది.
తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది.కామారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే.
కామారెడ్డి జిల్లా జంగంపల్లి చెందిన ఓ గర్భిణికి ఆదివారం కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్థారణ అయింది.ఇక ఆమెకు జన్మించిన శిశువుకు సోమవారం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.
ఇలా శిశువు జన్మించిన ఒక్కరోజు వ్యవధిలోనే ఇంకా కళ్ళు కూడా తెరవకముందే పాజిటివ్ అని నమోదవడం అటు తల్లిదండ్రులను ఎంతో ఆందోళనకు గురిచేస్తుంది.
కామారెడ్డి జిల్లాలో సోమవారం ఒకేరోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు, ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని… మాస్కులు ధరించడం తో పాటు భౌతిక దూరం పాటించాలి అంటూ సూచించారు.