ప్రస్తుత సమాజంలో అమ్మాయిల మీద ఎంతలా దారుణాలు జరుగుతున్నాయో చూస్తున్నాం.చిన్న పిల్లల దగ్గరి నుంచి పండు ముసలి వారి దాకా అత్యాచారాలు జరగడం నిజంగా బాధాకరమైన విషయం.
ఇప్పటికే ఇలాంటి క్రూరులకు ఎన్ని శిక్షలు విధించినా ఎంతమందిరోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపినా సరే ఈ ఆకృత్యాలు మాత్రం ఆగట్లేదు.అయితే ఇన్ని రోజులు అమ్మాయిల మీదనే ఆకృత్యాలు జరుగుతున్నట్టు తెలుసు.
కానీ ఇప్పుడు కర్ణాటకలో కొత్త తరహా వాదన తెరమీదకు వచ్చింది.అదేంటంటే ఈ రాష్ట్రంలో అబ్బాయిల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయంట.
వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇదే నిజమంట.ఆ రాష్ట్రంలో కామాంధులు కేవలం అమ్మాయిల్ని మాత్రమే కాకుండా అబ్బాయిలు కనిపించినా సరే వదలకుండా వారిమీద అఘాయిత్యాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు బాగానే జరిగినా ఇప్పుడు ఇవి ఎక్కువవుతున్నాయి.తాజాగా ఇలాంటి ఉదంతాలు రెండు జరిగడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.ఈ రాష్ట్రంలోని పుత్తూరు జిల్లాలో ఉంటున్న ఓ యువకుడు ఈవినింగ్ టైమ్లో వాకింగ్కు వెల్లాడు.
ఇక అటుగా వచ్చిన హనీఫ్ అనే పరిచయం ఉన్న వ్యక్తితో బయటకు వెల్లగా అతడు సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం చేయడం పెను సంచలనం రేపింది.ఇంకోవైపు బెల్గాంలో కూడా ఇలాంటి ఘటననే చోటుచేసుకుంది.ఈ జిల్లాలో 24 ఏళ్ల అబ్బాయి డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలు దేరగా తమ గ్రామానికి చెందిన మరో వ్యక్తి అతన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు.
ఈ రెండు ఘటనలు ఒకే సమయంలో చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది.దీనిపై పోలీసుల కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా అబ్బాయిలను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.అబ్బాయిలకు కూడా రక్షణ కరువైందని వాపోతున్నారు.