రాజకీయాల్లో రాణించాలంటే చాలా ఓపిక కావాలి.ఇక్కడ ఎంత ఓపికగా ప్రయత్నిస్తే చివరకు అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
ఈ విషయాన్ని వైఎస్ షర్మిల బాగానే పసిగట్టినట్టుంది.అందుకే ఎన్ని అవాంతరాలు వస్తున్నా సరే పట్టు మాత్రం విడవట్లేదు.
ఎలాగైనా సరే తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని చాలానే ప్రయత్నాలు చేస్తోంది.కానీ ఆమె ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చివరకు నిరాశే మిగులుతోంది.
చాలా సార్లు నెటిజన్ల ట్రోలింగ్ కు కూడా గువుతున్నారు.ఇప్పుడు తాజాగా మరోసారి ఇలాగే ట్రోలింగ్ కు గురవుతున్నారు.
తన తండ్రికి తెలంగాణలో ఉన్న అభిమానులను నమ్ముకుని ఆమె ఇప్పుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.దాదాపు 90 నియోజక వర్గాల మీదుగా ఆమె పాదయాత్రను సాగిస్తున్నారు.ఈ క్రమంలోనే ఎలాగైనా ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నా సరే అవి పెద్దగా ఫలించట్లేదు.తాను తెలంగాణ కోడలిని అని పక్కా తెలంగాణ వాదినని ఎంత చెప్తున్నా సరే ఎవరూ పట్టించుకోవట్లేదు.
అయితే ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ అయిన మొదట్లో కరోనా హామీ మీద చాలానే విమర్శలు చేసింది.కేసీఆర్ ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చట్లేదని బాగానే నిలదీసింది.
ఇప్పుడు పాదయాత్ర సందర్భంగా ఆమె మరోసారి కరోనా ట్రీట్ మెంట్ మీద మాట్లాడారు.తాము కరోనా ట్రీట్ మెంట్ను ఆరోగ్య శ్రీ చేర్చాలంటూ ఎంతలా కొట్లాడినా కేసీఆర్ కనికరించలేదని, తాము అధికారంలోకి వస్తే మాత్రం ఇప్పుడు ప్రజలు కరోనాకు పెడుతున్న ఖర్చులను మొత్తం తమ పార్టీ పాలనలో రెండేళ్ల లోపే రీ ఎంబర్స్ మెంట్ చేయిస్తామని హామీ ఇచ్చారు.కాబట్టి ప్రజలు ఇప్పుడు ఖర్చు పెట్టిన ఆస్పత్రి బిల్లులను తమ దగ్గర పెట్టుకోవాలన్నారు.అయితే దీనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఎందుకంటే అసలు షర్మిల ఎప్పుడు సీఎం అవుతుందో తమ బిల్లులు ఎప్పుడు రీఎంబర్స్ మెంట్ అవుతాయో అని వాటిని ఇంకా ఎన్నేండ్లు తమ దగ్గర దాచుకోవాలో అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.