షర్మిలను చూస్తుంటే నిజంగానే జాలేస్తోంది.ఎందుకంటే హాయిగా సీఎం జగన్ చెల్లెలుగా ఉండే ఆమె ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి ప్రతి పక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది.
అదే ఏపీలో జగన్ చెల్లెలుగా ఉంటే ప్రభుత్వమే ఆమె చేతిలో ఉండేది.అలా కాదని తెలంగాణ రాజకీయాలను శాసించాలని ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నానా కష్టాలు పడుతున్నారు.
ఇక ఇప్పుడు ఆమె పనితనం ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది.అదే సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న కామెంట్లపై నెటిజన్లు వేస్తున్న పంచులు అన్నీ ఇన్నీ కావు.
రీసెంట్గా ఆమె అధికార పార్టీ టీఆర్ ఎస్ పార్టీపైనా ఇటు రేవంత్, కాంగ్రెస్పైనా విరుచుకుపడుతున్నారు.ఇక ఇలా విమర్శలు చేసే క్రమంలో ఆమె టంగ్ స్లిప్ అయ్యి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.
మరీ ముఖ్యంగా ఆమె విలేకరులతో మాట్లాడినప్పుడు అసలు మంత్రి కేటీఆర్ ఎవరమ్మా అని అడగంపై ఎంతగా దుమారం రేగుతుందో అందరికీ తెలిసిందే.ఇక అదే విధంగా రేవంత్ రెడ్డిపైన కూడా ఆమె చేసిన కామెంట్లు పెద్ద సంచలనమే చేశాయి.
అయితే ఆమె ఎంతగా కామెంట్లు చేస్తున్నా అవతలి పార్టీలు లేదా నేతల నుంచి ఎలాంటి విమర్శగానీ కనీసం రియాక్షన్ గానీ లేకపోవడం గమనార్హం.
ఇక దీంతో అటు టీఆర్ ఎస్ గానీ ఇటు కాంగ్రెస్ గానీ కనీసం ఆమెను పెద్దగా పట్టించుకోవట్లేదని, కనీసం ఆమె ఉందని కూడా గుర్తించట్లేదని వారు భావిస్తున్నారు.ఎందుకంటే అనవసరంగా షర్మిల గురించి మాట్లాడితే ఆమె హైలెట్ అవుతుందని వారు భావిస్తున్నారు.ఇక దీన్నే ఆసరాగా చేసుకుని ఆమెపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
కనీసం ఆమె ఉందని గుర్తించడయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఆమె ఎలాగూ గెలవదు కానీ కనీసం గుర్తింపు అయినా ఇవ్వండంటూ కోరుతున్నారు.
మరి షర్మిలపై కనీసం ఏ పార్టీ అయినా కామెంట్లు చేస్తుందో లేదో చూడాలి.