రష్మీ చేసిన ఈ ట్వీట్ కు ఫిదా అయిన నెటిజన్లు...ఏమన్నదంటే?

ప్రస్తుతం కోవిడ్ సమయంలో జనజీవనం ఎంతలా స్థంభిస్తున్నదో మనం చూస్తున్నాం.ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది.

 Netizens Who Are Appreciating With This Tweet By Rashmi , Viral News, Anchor Ras-TeluguStop.com

కాని ఈ తరుణంలో రష్మీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారడమే కాదు, నెటిజన్లలో సరికొత్త ఆలోచనను రేకెత్తిస్తోంది.అయితే యాంకర్ రష్మీ బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ భామ సోషల్ మీడియా అత్యంత యాక్టివ్ గా ఉంటూ సామాజిక విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.

అయితే తాజాగా ఇప్పుడు రష్మీ మూగజీవాల పరిరక్షణకు అందరూ పాటుపడాలని, రోడ్డు మీద రోజూ చాలా మూగజీవాలు ప్రమాదానికి గురవుతూ ఉంటాయని, అలా ఏదైనా మూగజీవానికి మన కళ్ళ ముందు జరిగితే దానిని అలా చూస్తూ వెళ్లకుండా ఆ మూగజీవాన్ని రక్షించే ప్రయత్నం చేయాలని రష్మీ పేర్కొంది.ప్రస్తుత కోవిడ్ సమయంలో మూగ జీవాల రోదన ఆకాశాన్ని అంటుతున్నదని, ప్రతి ఒక్కరం మూగజీవాల రక్షణకు పాటుపడదామని రష్మీ పేర్కొంది.

ఇక వాటి పరిస్థితిలో మనం ఉంటే మనం కూడా సాయం కోసం ఆర్థిస్తామని, ఆ కోణంలో ఆలోచించి మూగజీవాల రక్షణకు పాల్పడాలని పేర్కొంది.సామాజిక బాధ్యతగా ఇటువంటి విషయాలపై స్పందిస్తున్న రష్మీ ని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube