బిగ్ బాస్ నాన్ స్టాప్ పై కేసు వెయ్యాలంటున్న నెటిజన్స్... కారణం ఇదే!

బుల్లితెర పై అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఈ కార్యక్రమం అన్ని భాషలలో సీజన్లను పూర్తిచేసుకుని ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

 Netizens Who Wants To Put Case On Bigg Boss Non Stop Do You Know The Reason Deta-TeluguStop.com

ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్ లను పూర్తి చేసుకొంది .ఈ కార్యక్రమం ఐదు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేస్తుందని నిర్వాహకులు చెప్పారు.అయితే ఈ సీజన్ వినోదాన్ని పంచడం ఏమో కానీ విమర్శలను మాత్రం ఎదుర్కొంది.ఈ విధంగా ఐదవ సీజన్ లో విన్నర్ గా సన్నీ, రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు.

ఈ బిగ్ బాస్ షో కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 3 సీజన్ ప్రసారమయ్యే సమయంలో హౌస్ మేట్స్ వారి ప్రవర్తన కారణంగా ఈ షోను ఆపివేయాలని యాంకర్ శ్వేత అప్పట్లో అన్నారు.

అంతేకాకుండా ఈ షో మీద చాలా నెగిటివిటీ ప్రేక్షకుల్లో పెరిగిపోయిందని ఈ కార్యక్రమం గురించి ఎన్నో విమర్శలు చోటు చేసుకున్నాయి.గత ఐదవ సీజన్ ల నుంచి బిగ్ బాస్ షో పై చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే హోస్ట్ నాగార్జున పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ కార్యక్రమం కేవలం గంట మాత్రమే కాకుండా 24 గంటలు ప్రసారమయ్యేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో, ప్రోమో విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలో వెన్నెల కిషోర్ దొంగతనం చేసి జైలుకు వెళ్తారు.

ఈ దొంగతనం చేసిన అతనికి కోర్టు ఉరి శిక్ష విధిస్తుంది.ఇక ఉరిశిక్ష వేస్తే ముందు చివరి కోరిక ఏదైనా ఉందా అని అడగగా తనకు బిగ్ బాస్ చూడాలని కోరికగా ఉందని తెలిపారు.

అయితే ఈ కార్యక్రమం 24 గంటలు ప్రసారం కావడంతో ఇక ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు, జడ్జి, జైలు అధికారులు కూడా పూర్తిగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండిపోతారు.ఇక ఈ ప్రోమోలో నాగార్జున లాయర్ గా కనిపించారు.ఇలా నాగార్జున నో పులి స్టాప్… నో కామా.నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈ ప్రోమో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో ఈ ప్రోమో పై నెటిజన్ స్పందిస్తూ బిగ్ బాస్ కార్యక్రమం గవర్నమెంటును దారుణంగా అవమానించారు.

ఈ ప్రోమో పై కేసు వేయాలి… జై కామెడీ బిగ్ బాస్ అంటూ కామెంట్ చేశారు.త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube