టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంతకు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.సమంత చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సమంత అంతకంతకూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా చాలామంది నెటిజన్లు ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం గమనార్హం.సమంత్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్లలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
బ్రిటిష్ ఫ్యాషన్ హౌజ్ బర్బరీని సమంత ప్రమోట్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో సమంత ఆ ఫోటోలన్ షేర్ చేయగా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
సమంత అభిమానులకు ఈ ఫోటోలు నచ్చినా సాధరణ అభిమానులు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
సమంత ఫోటోలను చూసి స్కిన్ చూపించడం బోల్డ్ నెస్ కాదు మేడం అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా మరొక నెటిజన్ యూ ఆర్ ఓల్డ్ ఆంటీ అంటూ కామెంట్ చేశారు.మరి కొందరు నెటిజన్లు సమంతకు తాము అభిమానులమని అయితే ఈ ఫోటోల వల్ల నిరాశకు గురయ్యామని చెప్పుకొచ్చారు.
సమంత షేర్ చేసిన ఫోటోలలో కొన్ని ఫోటోలు మరీ బోల్డ్ గా ఉన్నాయి.మరోవైపు సమంత తన అప్ కమింగ్ ఫిల్మ్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.సమంత పారితోషికం అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.
సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో తన రేంజ్ మరింత పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సమంత ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాలని అభిమానులు భావిస్తున్నారు.