ప్రతిభతో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సింగర్ గా సింగర్ మంగ్లీకి ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే.యూట్యూబ్ లో ఆమె పాడిన ఎన్నో పాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట ద్వారా మంగ్లీ పేరు మారుమ్రోగింది.దేవుళ్లకు సంబంధించిన పాటలను సైతం మంగ్లీ ఎక్కువగా పాడతారనే విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆమె పాడిన బోనాల పాట వివాదంలో చిక్కుకుంది.బోనాల సమయంలో అమ్మవారిని పొగుడుతూ పాటలు పాడాలే తప్ప విమర్శలు చేస్తూ పాటలు పాడటం ఏమిటని కామెంట్లు వినిపిస్తున్నాయి.
చెట్టు కింద కూసున్నవమ్మ లిరిక్స్ తో మంగ్లీ పాడిన పాటకు యూట్యూబ్ లో 40 లక్షల వ్యూస్ వచ్చాయి.పండుగ సమయంలో స్పెషల్ పాటలను రిలీజ్ చేసే మంగ్లీ తాజాగా ఈ పాటను పాడి వీడియో కూడా చేశారు.
ఈ పాటకు రామస్వామి లిరిక్స్ రాశారు.ఢీ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న పండు ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం గమనార్హం.ఆర్జే కిరణ్ పాటలో కొన్ని అభ్యంతర పదాలు ఉన్నాయని సుట్టములాగా, మోతవారి ఆ పదాలు ఏమిటని ఆదిపరాశక్తిని మోతవారి అనేంత నెత్తికెక్కాయా కళ్లు అని ఆర్జే కిరణ్ ప్రశ్నించారు.అమ్మను ఎవరూ మొక్కకండి అని చెబుతున్నావా మంగ్లీ అని ఆర్జే కిరణ్ ప్రశ్నించారు.
కొద్దిగా పేరు వచ్చేసరికి ఇలాంటి పాటలు పాడటం ఏమిటని ఆర్జే కిరణ్ చెప్పారు.తప్పు తెలుసుకుని లిరిక్స్ మారిస్తే మంచిదని హిందుత్వాన్ని చులకన చేయవద్దని ఆర్జే కిరణ్ అన్నారు.ఈ వివాదం గురించి మంగ్లీ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.అయితే కొందరు మాత్రం లిరిక్స్ విషయంలో మంగ్లీని తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.