టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లోనే దూసుకుపోతుంది.
తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.పైగా సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు కాబట్టి ఈ బ్యూటీ కి ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉంది.
అయితే అటువంటి నటికి పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది.ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.
సినీ ఇండస్ట్రీకి శృతిహాసన్ చిన్న వయసులోనే అడుగుపెట్టి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలా కొన్ని సినిమాలలో బాలనటిగా నటించిన తర్వాత హీరోయిన్ గా కూడా అడుగుపెట్టింది.
ఈమె తొలిసారిగా హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం కాగా ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మాత్రం అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో పరిచయమైంది.
ఈ సినిమాలో తన నటనతో మార్కులు సంపాదించుకోగా ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఏకంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కే ఎదిగింది.
అంతేకాకుండా తమిళంలో కూడా నటించింది.అలా వరుస సక్సెస్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
గతంలో ఈ బ్యూటీ వ్యక్తిగతంగా మాత్రం బాగా హాట్ టాపిక్ గా మారింది.అది కూడా ప్రేమ విషయంలోనే.
దానివల్ల కొంతకాలం సినిమాలకు గుడ్ బై కూడా చెప్పింది.ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస ప్రాజెక్టులతో బాగా దూసుకుపోతుంది.ఈ బ్యూటీ ప్రస్తుతం శాంతాను హజారికా అనే ఓ వ్యక్తి తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.చాలాసార్లు ఈమె తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
అంతేకాకుండా వీరిద్దరు రోడ్లపై కొచ్చి బాగా హల్ చల్ కూడా చేస్తుంటారు.ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది శృతి.
అయితే ఇదంతా పక్కన పెడితే అవకాశాలు అందినట్లే అందుతున్నప్పటికీ కూడా గుర్తింపు తెచ్చుకోలేక పోతుంది.రీ ఎంట్రీ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
అయితే చాలావరకు తన పాత్రల నిడివి తక్కువగా ఉండటంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోతుంది.
అయితే ఇటీవలే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమాలలో కూడా తన పాత్ర నిడివి అలా తక్కువగా ఉండటంతో తన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.మరి కొంతమంది చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా దీని గురించి ఒక మీమ్ కూడా బాగా వైరల్ అవుతుంది.
ఆ రెండు సినిమాల్లో తను కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించగా.
వెంటనే మన్మధుడు సినిమాలోని ఒక డైలాగును పెట్టి మీమ్ క్రియేట్ చేశారు.మన్మధుడు సినిమాలో నాగార్జున తన ఆఫీసులో సోనాలి బింద్రేను తిడుతూ ఈ ఆఫీసులో దీనివల్ల ఎంత ఉపయోగముందో అంటూ డెస్ట్ బిన్ ని చూపిస్తూ నీ వల్ల కూడా అంతే అంటూ తిడతాడు.
దీంతో సోనాలి ప్లేస్ లో శృతిహాసన్ ను పెట్టి దారుణంగా ట్రోల్ చేశారు.ప్రస్తుతం ఆ మీమ్ బాగా వైరల్ అవుతుంది.