బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ బాలీవుడ్ బ్యూటీ నిత్యం ఏదో ఒక వివాదంతో తరచూ సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.
అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధం లేని విషయాలపై కూడా ఈమె స్పందిస్తూ ఉంటుంది.వివాదాస్పద విషయాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
చిన్న చిన్న విషయాల లోనే కాకుండా పెద్ద పెద్ద కాంట్రవర్సీ ల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ సైతం గురి అవుతూ ఉంటుంది.
ఇక తనపై ట్రోలింగ్ చేసేవారికి తనదైన రీతిలో సమాధానం ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే తాజాగా ఒక పార్టీలో పాల్గొన్న కంగనా అందులో కెమెరాలకు శాస్త్రి కేకుతో కెమెరాలకు ఫోజులు ఇచ్చింది.
అందుకు సంబంధించిన వీడియోని సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.ఇందులో ఆమె కేకు నోటి దాకా తీసుకు వచ్చిన ఆమె ఫోటో తీసుకున్న తర్వాత దాని ప్లేటులో ఇతర కేక్ పీస్ లతో కలిసి పోయే విధంగా పెట్టేసింది.
ఈ విషయంపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.కరోనా ను వ్యాప్తి చేస్తోంది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.
ఎంత అపరిశుభ్రంగా వ్యవహరిస్తోంది అంటూ మరొక నెటిజెన్ కామెంట్ చేశాడు.రోజురోజుకీ కరోనా అంతకంతకు వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.
ఇలాంటి సమయంలో కేక్ ని నోటి దాకా తీసుకువచ్చి మళ్లీ అక్కడే పెట్టింది.ఈ విషయంపై మరొక నెటిజన్ కేక్ తినండి దానివి కేకులు ఎందుకు అంత దగ్గరగా తీసుకెళ్లావు.మళ్లీ ఎందుకు అక్కడే పెట్టేశావు అంటూ కామెంట్ చేసాడు.అలాంటి ఆహారాన్ని మరొకరు ఎలా తింటారు.అలా పెట్టిన దాన్ని ఎవరైనా తింటే వాళ్ల నోట్లోకి క్రిములు వెళ్లే అవకాశం ఉంది అంటూ మరొక నెటిజన్ కామెంట్ రాసుకొచ్చాడు.మొత్తానికి ఇలా మరొకసారి కంగనా వార్తల్లో నిలవడమే కాకుండా, ట్రోలింగ్స్ ని సైతం ఎదుర్కొంది.