యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో రెండు వారాల క్రితం ప్రారంభమై ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ తో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తోంది.ఎవరు మీలో కోటీశ్వరులు గతంలో ప్రసారమైన సీజన్లతో పోలిస్తే మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది.
ఎన్టీఆర్ బుల్లితెరపై హోస్టుగా మరోసారి అదరగొట్టాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఒక విషయంలో మాత్రం నెటిజన్లు ఈ షోను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి షో వేర్వేరు పేర్లతో ఇతర భాషల్లో ప్రసారమవుతుంది.టాలెంట్ ఉన్న సామాన్యులను సంపన్నులను చేయాలనే సదుద్దేశంతో ప్రసారమవుతున్న ఈ షోను తెలుగులో ఎవరు మీలో కోటీశ్వరులు ఆగష్టు 22వ తేదీ నుంచి ప్రసారం చేస్తున్నారు.
అయితే ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ప్రశ్నలు మరీ సిల్లీగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.పెద్దగా విజ్ఞానం లేనివాళ్లు కూడా సులభంగా సమాధానాలు చెప్పేలా ఉన్నాయి.
ఈ షోలో అడుగుతున్న ప్రశ్నలు ప్రేక్షకుల మేధస్సును పరీక్షించకపోగా కొంతమంది కంటెస్టెంట్లు ఇంతచిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారనే నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
నాగార్జున, చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో రియాలిటీ షోను హోస్ట్ చేసిన సమయంలో ఈ తరహా కామెంట్లు వినిపించలేదు.కొంతమంది సిల్లీ ప్రశ్నలను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఛానల్ నిర్వాహకులు ఇకనైనా ఈ షో ప్రశ్నల విషయంలో స్వల్పంగా మార్పులు చేయాల్సి ఉంది.మార్పులు చేయని పక్షంగా షో రేటింగ్స్ పై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి.మొదటి ఐదు ప్రశ్నలు మరీ సులభంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ కూడా సిల్లీ ప్రశ్నలు అడగకూడదని నెటిజన్లు కోరుతున్నారు.