బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 గత సీజన్ల స్థాయిలో ఆకట్టుకోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూనే సుత్తితో ప్రియ, రవి అనే పేర్లు ఉన్న టైల్స్ ను పగలగొట్టాడు.
ప్రియగారు చేసిన కామెంట్లు బాధ పెట్టాయని రవి వెల్లడించారు.నా ఉద్దేశంలో తప్పు ప్రియగారిదని రవి అన్నారు.
లహరి నన్ను నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్ సిల్లీగా అనిపించిందని ప్రియ పేర్కొన్నారు.
లహరి నాతో కనెక్ట్ కాలేదని ప్రియ వెల్లడించారు.
నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో జెండర్ డిఫరెన్స్ లేదని పేర్కొన్నారు.లహరి మేల్ కంటెస్టెంట్లతో బిజీగా ఉందని మాత్రమే తాను అన్నానని ప్రియ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత నాగార్జున లహరిని పవర్ రూమ్ లోకి పంపించారు.ఆ వీడియోలో రవి లహరి యాంకర్ కావడానికి ట్రై చేస్తుందని బిగ్ బాస్ హౌస్ లో పెళ్లికాని వాళ్లు ఉన్నా లహరి తన వెంటే పడుతోందని రవి ఆ వీడియోలో వెల్లడించారు.
రవిని బ్రో అని పిలవకపోయినా మనస్సులో అదే ఫీలింగ్ ఉందని లహరి తెలిపారు.తప్పు చేయని వాళ్లను హగ్ చేసుకోవాలని తప్పు చేసిన వాళ్లను నిలదీయాలని నాగార్జున సూచించగా లహరి బయటకు వచ్చిన తర్వాత రవిని నిలదీశారు.ప్రియతో రవిగారు మాట్లాడిన మాటలు తప్పని లహరి అన్నారు.అమ్మతోడు అని చెబుతూ సింగిల్ మేన్ అని అనలేదని రవి చెప్పాడని నాగార్జున వెల్లడించారు.
నాగార్జున ఇచ్చిన క్లారిటీ వల్ల రవిది తప్పు అని ప్రూవ్ అయింది.రవి అమ్మతోడు అని చెప్పి కూడా అబద్ధం చెప్పడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.ఆ తర్వాత మానస్ ను వరస్ట్ పర్ఫామర్ అని అనుకోవడం ఎందుకని విశ్వ వరస్ట్ కెప్టెన్ అని కాజల్ చెప్పిందని నాగార్జున చెప్పుకొచ్చారు.