సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు చెందిన ఏ విషయం అయినా బాగా వైరల్ అవుతుంది.అది మంచి అయినా.
చెడు అయినా క్షణాల్లో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.తాజాగా సౌత్ హీరోయిన్ రష్మిక మందాన, ప్రముఖ సింగర్ నేహా కక్కర్ పై సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోల్స్ నడుస్తున్నాయి.
వీరిద్దరు వీధి బాలల పట్ల స్పందించిన తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ వారిపై నెటిజన్లకు కోపం ఎందుకో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది అందాల తార రష్మిక మందాన. ఈ సినిమా ఆమె కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది.
ఇందులో తను డీ గ్లామర్ పాత్ర చేసినా.నటన పట్ల మంచి మార్కులు పడ్డాయి.
పలువురు విమర్శకులు సైతం ఆమె నటకు ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా.
ఓ సినిమా షూటింగ్ ముగించుకుని బయటకు వచ్చింది.ఆ సమయంలో కొంత మంది వీధి బాలలు ఆమె దగ్గరికి వచ్చారు.
సాయం కోసం చేతులు చాచారు.అయితే తన దగ్గర డబ్బులు లేవంటూ కారెక్కింది.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అటు టాప్ సింగర్ నేహా కక్కర్ కారులో వెళ్తుండగా.కొందరు వీధి బాలలు ఆమె చుట్టు వచ్చారు.సాయం కోసం కొంత మంది చిన్నారులు కారు దగ్గరికి వచ్చారు.అయితే 500 నోట్ల కట్ట పట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కో నోటు ఇవ్వడం మొదలు పెట్టింది.దాన్ని చూసి ఇంకా చాలా మంది అక్కడికి వచ్చారు.దీంతో ఆమె ఇవ్వడం మానేసి కార్ విండో క్లోజ్ చేసుకుంది.
వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.అయితే నేహా తీరుపై కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.